నవాబ్పేట, డిసెంబర్ 24 : లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్శాఖ జిల్లా అధికారి సారిక అన్నారు. నవాబ్పేట, కొల్లూరు గ్రామాల్లో రైస్మిల్లులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలను పరిశీలించారు.
లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్ల నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, వైస్చైర్మన్ చందర్నాయక్, కార్యదర్శి శివశంకర్రెడ్డి, సూపర్వైజర్ వెంకటమ్మ పాల్గొన్నారు.