వీపనగండ్ల, ఏప్రిల్ 10 : ఆశించిన స్థాయిలో వ ర్షాలు కురవకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాత్కాలికంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవిలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్, పర్యాట క శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోపల్దిన్నె రిజర్వాయర్ లో నీటినిల్వలను మంత్రి పరిశీలించారు. గోపల్ది న్నె రిజర్వాయర్ నుంచి వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబావి మండలాలకు సంబంధించి 38 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం తాగునీటి అవసరాల కోసం కనీసం 5 టీఎంసీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ద్వారా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరామన్నారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 0.4 టీఎంసీ మాత్రమే అందుబాటులో ఉన్నందున గోపల్దిన్నె రిజర్వాయర్కు 0.1 టీఎంసీని వినియోగించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున వ్యవసాయానికి నీటిని వాడకుండా రైతులు సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు సుదర్శన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, బాల్రెడ్డి, నారాయణ రెడ్డి, ఎత్తం కృష్ణయ్య, గంగిరెడ్డి, వెంకటయ్య, కురుమయ్య, రవీందర్రెడ్డి, బీచుపల్లియాదవ్, జ్యోతీశ్వర్ గౌడ్, రంజిత్కుమార్, గోపి, బాలు, మహేశ్, విష్ణు, భరత్ పాల్గొన్నారు.