మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 28: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నేర చరిత్ర ఉన్నవారిని జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి వారి ప్రవర్తనపై ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మెలిగేవారికి పోలీసు సహకారం ఉంటుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 848 మంది నేర చరిత్ర కలిగి నిరంతరం నిఘాలో ఉండగా, వీరిలో సత్ప్రవర్తనతో మెలుగుతున్న 84మందిపై నేర చరిత్ర రికార్డు తొలగించాలని ని ర్ణయించినట్లు ఎస్పీ తెలిపారు. సమాజంలో మంచిగా బతుకుతున్న వారిని గమనించి, ము న్మందు మరికొందరిపై కూడా నేరచరిత్ర రికార్డు తొలగించడం జరుగుతుందన్నారు.
పోలీసు శాఖ ఎవరిపైనా వ్యక్తిగత కక్షతో ఉండదని, సమాజ శాంతికి భంగం కలిగించేవారిపై మాత్రమే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందన్నారు. భూకబ్జాలు, అల్లర్లు సృష్టించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై చట్టప్రకారం హిస్టరీ పిట్ ఓపెన్ చేయడం జరుగుందని హెచ్చరించారు. సమాజంలోని అందరినీ ప్రేమిస్తూ, ఒకరికొకరు సహకార ధోరణితో జీవించడంలోనే గొప్పతనం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ మహేశ్, ఇన్స్పెక్టర్లు, అధికారులు పాల్గ్గొన్నారు.