అచ్చంపేట, మార్చి 3 : చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించారు. రెండురోజుల పాటు వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి పొలియో చుక్కలు వేస్తారన్నారు. ఆయన వెంట నాయకులు రాజేందర్, కౌన్సిలర్ గౌరీశంకర్ పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ టౌన్, మార్చి 3 : జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, ఈదమ్మగుడి వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పో లియో కేంద్రాలను డీఎంహెచ్వో సుధాకర్లాల్ ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ పరిధిలో ఉన్న చిన్నారులను గుర్తించి పోలియోచుక్కలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రవికుమార్, ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ ఉన్నారు.
కొల్లాపూర్, ఫిబ్రవరి 3 : పోలియో మహమ్మారిని త రిమి చిన్నారుల బంగారు భవిష్యత్కు బాటలు వేద్దామని జిల్లా అదనపు వైద్యాధికారి వెంకట్దాస్ పిలుపునిచ్చా రు. ఆదివారం కొల్లాపూర్ సివిల్ దవాఖానలో చిన్నారులకు ఆయన చుక్కల మందు వేసి మాట్లాడారు. ప్రతి ఒ క్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో పెంట్లవెల్లి పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్, సబ్యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్, ఫార్మాసిస్ట్లు, హెల్త్ అసిసెంట్లు పాల్గొన్నారు. కాగాకొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లో ఆదివారం 9,048 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు పెంట్లవెల్లి పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రెండు మండలాల్లో 8,193 మందికి, సింగవట్నం జాతరలో 855 మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బిజినేపల్లి, మార్చి 3 : చిన్నారులకు వారి తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా ఆరోగ్య ప్రోగ్రాం అధికారి సాయినాథ్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు శివకుమార్, శ్రీకాంత్, తేజశ్విని, మేఘనారెడ్డి, పర్యవేక్షకులు, సిబ్బంది ఉన్నారు.
అచ్చంపేట టౌన్, మార్చి 3 : చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని కౌన్సిల ర్ గోపిశెట్టి శివ అన్నారు. 18వవార్డులో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చుక్కలమందు వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మలాబాయి, సైదమ్మ పాల్గొన్నారు.
కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్, మార్చి 3 : పోలియో ర హిత సమాజ నిర్మాణానికి పాటు పడదామని మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం పిలుపునిచ్చారు.ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియోచుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రఘుపతిపేట, తోటపల్లిలో 24 గ్రామాల్లో రఘుపతిపేట, తోటపల్లిలో 6,226మంది చిన్నారులకు పోలీయో చుక్కల వైద్యసిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు వేశారు.
అమ్రాబాద్, మార్చి 3 : మండలంలోని మన్ననూర్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో జెడ్పీటీసీ అనురాధ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ఎంపీపీ శంభుశోభ, కోఆప్షన్ స భ్యుడు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ, మార్చి 3 : పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించి మహామ్మారిని తరిమికొడదామని మాజీ ఎంపీ మల్లురవి అన్నారు. ఆకార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మైసిగండి శ్రీనివాస్గౌడ్, వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ వెంకటయ్యగౌడ్, మోతిలాల్నాయక్, ఎర్రశ్రీను, పుల్లయ్య ,రమేశ్ ఉన్నారు.
చారకొండ, మార్చి 3 : మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు డివిజన్ స్పెషల్ అధికారి లక్ష్మణ్, మండల వైద్యాధికారి మంజుభార్గవి అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ ప్రమీల, సీహెచ్వో శేఖర్రెడ్డి, హెచ్ఈవో ఎన్టీవీచారి పాల్గొన్నారు.
కోడేరు, మార్చి 3 : బస్టాండ్లో చిన్నారులకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి దశరథం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో మొత్తం 3,998 మంది చిన్నారులు ఉండగా 3,911 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ నారాయణ, హెల్త్ అసిస్టెంట్ మల్లేశ్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి, మార్చి 3 : మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో చిన్నారులకు డాక్టర్ రోహిత్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది ఏఎన్ఎంలు ఉన్నారు.
పెంట్లవెల్లి, మార్చి 3 : మండలంలో పల్స్ పోలియో 98.6శాతం నమోదైనట్లు మండల వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు
తాడూరు, మార్చి 3 : మండలంలో ఐదేండ్లలోపు చిన్నారులు 4,064 మంది ఉండగా వారి కోసం 26 బూత్లు, మూడు రూట్లలో 104 మంది సిబ్బందిని నియమించినట్లు డాక్టర్ కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సంతోష్, అభిరామ్, సీహెచ్వో ఆహ్మద్ అలీ, సూపర్వైజర్లు ఉన్నారు.
బల్మూరు, మార్చి 3 : మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతమైందని వైద్యాధికారి తారాసింగ్ తెలిపారు. సోమవారం ఇంటింటికీ వెళ్లి వేయాలని సిబ్బందికి సూచించారు.
ఉప్పునుంతల, మార్చి 3 : మండలంలో 2,942 మంది చిన్నారులు ఉండగా ఆదివారం 2,883 మందికి పోలియో చుక్కలు వేసినట్లు వైద్యురాలు గీత తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి బిక్కూలాల్, ఎంపీహెచ్వో మధునాయక్, పీహెచ్ఎన్ జోన్స్ పాల్గొన్నారు.
చారకొండ, మార్చి 3 : 17 పంచాయతీల్లో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు డివిజన్ స్పెషల్ అధికారి లక్ష్మణ్, మండల వైద్యాధికారి మంజుభార్గవి అన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ ప్రమీల, సీహెచ్వో శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
వంగూరు, మార్చి 3 : మండలంలోని వివిధ గ్రామా ల్లో ఆదివారం జాతీయ పల్స్ పోలియే కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 3170 టార్గెట్ వుండగా 3011 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది సుధాకర్ ఆధ్వర్యంలో పోలియో వేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.