రాజోళి, మే 26 : మండల కేంద్రంలో తుమ్మలపల్లి శివారు లో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం తో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర కు.. కర్నూల్ జిల్లా కొంతలపాడుకు చెందిన చంద్రశేఖర్(19) రాజోళి నుంచి తూర్పు గార్లపా డు గ్రామం వైపు వెళ్త్తుండగా తూ ర్పుగార్లపాడుకు చెందిన టీఎస్ 06ఈవీ5159 నెంబర్ గల ట్రాక్టర్ మట్టిలోడ్తో వస్తూ వెనుకనుంచి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట ఉంచి ఆందోళన నిర్వహించారు. కాగా ఇంటిముందే అంత్యక్రియలు చేస్తామని బైఠాయించారు. విషయం తెలుసుకున్న శాంతినగర్ సీఐ రత్నం పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజె ప్పారు. ఎంతసేపటికి వినకపోగా తప్పకుండా మృ తికి కారణమైన వ్యక్తులను చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి మృ తదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, ఘ టనపై ఇంకా పూర్తి వివరాల్లో భాగంగా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.