లింగాల, మే 26 : చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొత్తకుంటపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన శశాంక్రెడ్డి(32) బెట్టింగ్లు, ఇతర అలవాట్లకు బానిసగా మారి రూ.లక్ష అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో హైదరాబాద్ నుంచి లింగాలలోని తమ మామిడితోటకు చేరుకొని ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆదివారం తోటకు వెళ్లిన కుటుంబ సభ్యులకు చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి విష్ణువర్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.