అమ్రాబాద్, నవంబర్ 24 : మండలంలోని వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్ర యాణికులకు కనిపించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు దా టుతూ కనిపించింది. దీంతో వాహనాలు దూరంలోనే నిలిపి సెల్ఫోన్లలో ఫొటోలు తీ సుకున్నారు. నల్లమలలో పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.