మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 1 : నూతన విధానం తో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ అకాడమీలో ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికల్లో చిన్నచిన్న దేశాల క్రీడాకారులు అద్భుతంగా రాణించి పతకాలు సాధిస్తున్నారన్నారు.
మన దేశం మాత్రం ఎంతో వె నుకబడి ఉందని, సరైనా క్రీడావిధానం లేనందునే రాణించలేకపోతున్నట్లు చెప్పారు. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ వాలీబాల్ అకాడమీ నుంచి ప్రతి భ గల క్రీడాకారులను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించ డం, కోచ్ల సంక్షేమం, మౌలిక సదుపాయల కల్పనకు క్రీ డాపాలసీని రూపొందిస్తున్నామన్నారు.
త్వరలోనే కేబినెట్ ఆమోదం వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీ డాప్రాంగణాలను ఏర్పాటు చేస్తుండగా, 7,500 గ్రామాల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా లో రూ.17.32 కోట్లతో వంద శాతం నిర్మించామన్నారు. ఇండోర్ స్టేడియం పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి, వాలీబాల్ అకాడమీ అడ్మిన్ వెంకటేశ్వరావు, డీవైఎస్వో శ్రీనివాస్, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు యశ్వంత్కుమార్, కోచ్ వీరారెడ్డి, కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు.