మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 24 : కుల దైవం దర్శనానికి వెళ్లి బైక్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన మహబూబ్నగర్ శివారులో చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. భూ త్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన బండమీది బాబు (50), పల్లె శ్రీకాంత్ (25) శుక్రవారం దేవరకద్ర మండలంలోని తమ కులదైవాన్ని దర్శించుకోవడానికి బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దేవరకద్ర వైపు వెళ్తున్న లారీ (కేఏ 34 సీ 7116) మహబూబ్నగర్ సమీపంలోని ఆల్ మదీనా కాలేజీ వద్ద అతివేగంగా వచ్చి వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బాబు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్ను స్థానికులు జిల్లా దవాఖానకు తరలించారు. కాగా వైద్యులు పరీక్షించి అ ప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ఇద్దరి మృతదేహల ను పోస్టుమార్టం నిమి త్తం మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వృత్తి రీ త్యా బాబు గోర్ల కాపరి కాగా ఆయనకు భార్య, పిల్ల లు ఉన్నారు. శ్రీకాంత్కు రెండు నెలల కిందటే వివాహం కాగా హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. వీరి మృతితో గ్రా మంలో విషాదఛాయలు అలుముకున్నాయి.