మాగనూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కల్తీ ఆహారం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల అధికారులు హూటాహుటిన మంగళవారం పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనానికి, వినియోగించిన కూరగాయల సామాగ్రిని పరిశీలించారు. చెడిపోయిన అల్లం, కాలం చెల్లిన, నాణ్యత లేని వాటి ని వాడుతున్నట్లు గమనించారు. ఆ వస్తువులను బయట పడేయాలని ఏజెన్సీకి సూచించారు. అ నంతరం 10వ తరగతి విద్యార్థులతో మధ్యాహ్న భోజనంపై చర్చించి వివరాలు సేకరించారు. 99 శాతం మంచిగా ఉండడం లేదని అసహనం వ్య క్తం చేశారు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారు లు లక్ష్మీనారాయణ, యాదయ్య, రాజేందర్ వి ద్యా ర్థులు మధ్యాహ్న భోజనం చేసే వరకు అక్కడే ఉండి పరిశీలించారు.
అయినా అధికారుల పర్యవేక్షణలో కూడా అన్నంలో పురుగులు, రాళ్లు రావడంతో ఒకసారిగా షాక్కు గురయ్యారు. వంట ఏజెన్సీ మధ్యాహ్న భోజన విషయంలో చాలా నిర్ల క్ష్యం చేస్తున్న విషయం అధికారులకు పరిశీలించా రు. చివరి అవకాశంగా వంట ఏజెన్సీకి ఇవ్వాలని అధికారులకు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయు లు, విద్యా కమిటీ చైర్మన్ సమక్షంలో తీర్మానం చే శారు. ఇకపై ఇలాంటి సమస్య మళ్లీ వస్తే ఏజెన్సీ నుంచి తొలగిస్తామని జిల్లాస్థాయి అధికారులు హెచ్చరించారు.