నారాయణపేట, నవంబర్ 5 : నారాయణపేట ని యోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి రూ.75.75 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి తెలిపారు. నారాయణపేట క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోరిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రజ ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జీవో ఆర్టీ నెంబర్ 36 కింద నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయన్నారు. శాశ్వత భవనం నిర్మిం చే వరకు తాత్కాలిక భవనంలో తరగతులు కొనసాగుతాయన్నారు. జిల్లాలో ఒక్క ప్రైవేట్ డిగ్రీ కళాశాల మా త్రమే ఉండేదని, తెలంగాణ వచ్చాక ఆ కళాశాలను ప్ర భుత్వపరం చేసి, ఉద్యోగులను పర్మినెంట్ చేశామన్నా రు.
జీవో ఆర్టీ నెంబర్ 41 కింద ధన్వాడ మండలకేంద్రానికి మంజూరైన డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించామన్నారు. త్వర లో అన్ని నియోజకవర్గ కేంద్రాలకు డిగ్రీ కళాశాలలు మంజూరు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుంద ని చెప్పారు. ధన్వాడ తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింద రూ.1.75 కోట్లు మంజూరయ్యాయన్నారు. హైదరాబాద్లోని బంజారభవన్ మాదిరిగా.. పేట జిల్లా కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింద రూ.కోటి నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరికల్ మండల కేంద్రంలో తాసిల్దార్, ఎం పీడీవో, ఎంఈవో తదితర కార్యాలయాలన్నీ ఒక్కచోటే ఉండేలా ఇంటిగ్రేటేడ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.7 కోట్లు మంజూరయ్యాయన్నారు. కోయిల్కొండలోని రామకొండ గుట్టపై అధునాతన హంగులతో ఆలయా న్ని నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి నుంచి కోయిల్కొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికిగానూ రూ.56 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కాగా, రూ.3 కోట్లతో నారాయణపేట మండలంలో రూరల్ పోలీస్ స్టేషన్, మరో రూ.3 కోట్లతో ధన్వాడలో పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు రిలీజ్ చేయ నున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ, మం డలాధ్యక్షులు విజయ్సాగర్, రాములు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజోద్దీన్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఏస్ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణబట్టడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ జగదీశ్, శివరాంరెడ్డి, సుభాష్, శ్రీపాదకులకర్ణి, నరేందర్గౌడ్ ఉన్నారు.