వనపర్తి, జనవరి 26 : బీఆర్ఎస్ పార్టీ ఓటమి సోష ల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వల్లే జరిగిందని మా జీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడి యా వారియర్స్ సమావేశంలో మాజీ పార్లమెంట్ స భ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గు వ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాష్టాన్ని నిధులు, నీళ్లు, నియామకాల పేరిట అ ద్భుత అభివృద్ధితో తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపారన్నారు. అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి న కేసీఆర్పై కేవలం సోషల్ మీడియాలో లేనిపోని దు ష్ప్రచారం వల్లే వెనుకబడి ఓడిపోవటానికి కారణమైందన్నారు.
ఒక్క కేసీఆర్ను ఓడించడానికి రాష్ట్రంలో 70 యూట్యూబ్ చానళ్లు ఐదేండ్లు కష్టపడ్డాయని తెలిపారు. ఆధునిక కాలంలో నిజం నిలబడే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముడుతుందనే నానుడి నిజమన్న విషయా న్ని సోషల్ మీడియా వారియర్స్ గుర్తించాలన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులను తిరుగులేని శక్తిగా మా ర్చి కాంగ్రెస్ 420 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వారు చేసిన అసత్య ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి మొట్టమొదట ఈ ప్రక్రియను నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే నాంది పలుకుదామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా వారియర్స్ సమావేశాలు నిర్వహించి వ్యవస్థను పటిష్టంగా చేస్తామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత రం గినేని అభిలాష్రావు తదితరులు పాల్గొన్నారు.