గద్వాల రూరల్, జనవరి 31: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. జములమ్మ తల్లీ.. కరుణించమ్మా.. అంటూ కొందరు మహిళలు బైనోళ్ల శబ్దాలకు పూనకంతో ఊగిపోయారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలొచ్చారు. మంగళవారం సాయం త్రం వరకు 70వేల మంది భక్తు లు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయకమిటీ చైర్మన్ సతీష్కుమా ర్, ఈవో కవిత తెలిపారు. చైర్మన్ ప్రత్యేక చొరవతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈవో స్పష్టం చేశా రు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూరల్ ఎస్సై ఆనంద్ బందోబస్తు నిర్వహించారు.
పుట్టినింటికి బయల్దేరిన ఎడ్లబండి..
జములమ్మ పుట్టినిైళ్లెన (దివి గ్రామం) గుర్రంగడ్డ నుంచి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు జములమ్మను మెట్టినింటికి తీసుకురావడం ఆనవాయితీ. ఇందుకోసం సారెను సిద్ధం చేసి భాజాభజంత్రీల నడుమ ఎడ్లబండికి చైర్మన్ సతీష్కుమార్, ఈవో ప్రత్యేక పూజలు చేసి సాగనంపారు. సాయంత్రం గుర్రంగడ్డకు చేరుకొని అక్కడ పూజ ల అనంతరం సాంప్రదాయం ప్రకారం మెట్టినిైళ్లెన జ మ్మిచేడుకు బుధవారం ఉదయం అమ్మవారు చేరుకుంటారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, పుణెకు చెందిన 72 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని తీసుకురానున్నారు. అప్పటి నుంచి ఏడాది పాటు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమంలో జానకీరాములు, మాధవికాంబ్లె, అభిలాష్, విజయ్, శంకర్, కృష్ణ, సువందరాజు, నాగరాజు, బంగి రవి, గోపాల్, ఆనంద్, యేసు, తోటరాముడు, రంగన్న, లక్ష్మన్న, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.