అన్నం.. కర్రీ, సాంబర్.. వాటర్ ప్యాకెట్.. రూ.5కే.. రుచికరమైన భోజనం. ఇదేదో హోటలో.. రెస్టారెంటో కాదండి.. నిరుపేదల కోసం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అందిస్తున్న ఆహారం.. కేసీఆర్ క్యాంటిన్లో తక్కువ ధరకే భోజనం అందిస్తూ పేదల కడుపు నింపుతున్నారు. ఇదొక్కటే కాదండి.. కేసీఆర్ స్టడీ సర్కిల్ పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం కోచింగ్ ఇస్తున్నారు. ఉచితంగా బస్పాసులు, 25 వేల మందికి సొంత డబ్బుతో డ్రైవింగ్ లైసెన్స్లు అందజేశారు. ఆరోగ్య పరిరణక్షకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నారు. ఇలా పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.. మరోవైపు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. పదిమందికి మేలు చేయాలన్న సంకల్పంతో పేదలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతూ బండ్ల తన మార్క్ చాటుకుంటున్నారు.
గద్వాల, నవంబర్ 8: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో నియోజకవర్గ అభివృద్ధికి పా టుపడుతున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి. సీఎం కేసీఆర్తో మాట్లా డి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల దరిచేర్చుతూనే తన సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. పదిమందికి మేలు చేయాలనే ఆలోచనతో సొంతగా డబ్బులు వెచ్చించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్వాల నియోజకరవ్గంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నియోజకరవ్గంలో చేపడుతున్న సంక్షేమ, సామాజిక సేవాకార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో 2015లో కేసీఆర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రభు త్వం వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదల చేయగా.. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ప్రభుత్వ కొ లువు సాధించడంలో చేయూనివ్వాలనే సదుద్దేశంతో కేసీఆర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్కు సిద్ధమవుతున్న 4వేల మంది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇప్పించడమే కాకుండా శిక్షణపొందినవారికి రూ. కోటి50లక్షలు విలువ చేసే స్టడీ మెటీరియల్ అందజేశారు. 2018నుంచి ఇప్పటి వరకు 10వతరగతి విద్యార్థులకు ఉచిత స్టడీమెటీరియల్ అందించడంతోపాటు దూరప్రాంతాల నుంచి కాలినడకన పాఠశాలకు వెళ్లే 2వేలమందికి సైకిళ్లు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి గద్వాలకు చదువుకునేందుకు బస్సుల్లో వచ్చే విద్యార్థులకు ఆర్టీసీకి ఒకేసారి ఏడాది డబ్బులు చెల్లించి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.
ప్రతిరోజూ గద్వాల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు జిల్లాకేంద్రానికి వస్తుంటారు. వారు హోటల్కు వెళ్లి భోజనం చేయాలంటే రూ. 100లేనిదే రాదు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే అన్నదాతగా పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అం దించాలనే లక్ష్యంతో కేసీఆర్ క్యాం టిన్ ప్రారంభించి ప్రతిరోజూ 500 మందికి నాణ్యమైన, రుచికరమైన భోజనంతో కడుపు నింపుతున్నారు. కేసీఆర్ క్యాంటీన్కు మంచి ఆదరణ లభిస్తుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వాహనదారులు ప్రాణా లు కోల్పోతున్నారు. వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్లు లేకపోవడంతో వారికి ఇన్సూరెన్స్రాక నానా అవస్థలు పడేవారు. దీంతో ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గాన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని వాహనం నడిపే ప్రతిఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే ఆలోచనతో ఉచిత డ్రై వింగ్ లైసెన్స్ మేళా నిర్వహించి అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేసేందుకు శ్రీకారం చుట్టా రు. నియోజకవర్గంలో సుమారు 25వేల మందికి సొంత డబ్బుతో ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించారు.
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రజల జీవనవిధానంలో మార్పులతోపాటు వారుతీసుకునే ఆహారం కల్తీది కావడంతో ప్రజలు వివిధ రోగాలబారిన పడుతున్నారు. రోగాల నుంచి బయటపడడానికి వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగం గా గద్వాల నియోజకవర్గ ప్రజలకు రూ.5లక్షల విలువ చేసే ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ బీమా పొందడంతో రాష్ట్రంలో నిర్ధేశించిన కార్పోరేట్ దవాఖానల్లో ఉచితంగా రూ.5లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఇలా ఎమ్మెల్యే ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల దరికి చేర్చూతూనే సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.