మహబూబ్నగర్, మార్చి 28 : జిల్లాలోని బాలానగర్ మండలం నందారంలో పురాతమైన రాగి నాణేలు బయటపడ్డాయి. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరేశ్కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు సంబంధించి పొలాన్ని చదును చేస్తుండగా ఓ పాడుబడ్డ కుండ లభించడంతో బయటికి తీసి చూశారు. అందులో నాణేలు ఉండడంతో అవి నిజాం కాలానికి చెంది ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ వెంకట్రాములు ఘటన స్థలానికి చేరుకొని నాణేలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల, పంచాయతీ కార్యదర్శి నరేశ్కుమార్ పాల్గొన్నారు.