వనపర్తి, ఆగస్టు 15 : మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు కలలుగన్న భారతావనిని నిర్మించుకుందామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ సింహభాగాన నిలుస్తుందన్నారు. ప్రధానంగా తెలంగాణలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ పథకాలు అందజే స్తూ, పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. 654 మంది రైతులను గుర్తించి, 800 ఎకరాల్లో ఆయిల్పాం మొక్కలు నాటించామన్నా రు. మరో 2011 ఎకరాలను గుర్తించి 1705 ఎకరాలకు పరిపాలనా ఉత్తర్వులను మంజూరు చేశామన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. సొంత స్థలం ఉన్న పే దలకు గృహలక్ష్మి పథకం ద్వారా విడుతల వారీగా రూ.3లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. వనపర్తి జిల్లాలో పేరుగాంచిన రాజాగారి ప్యాలెస్, ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల బాలికల, బాలుర వసతి గృహాల నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేశామన్నారు.
జిల్లాలో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, 14 పీహెచ్సీలు, 104 ఆరోగ్య ఉపకేంద్రాలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 బస్తీ దవాఖానాలు ఏర్పా టు చేశామన్నారు. నవజాత శిశువుల సంరక్షణకు 180 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. హరితహారంలో మొక్కలు నాటి అటవీ శాతాన్ని పెంచామన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లతోపాటు 2023-24 సంవత్సరంలో 9 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్ ఇప్పించామన్నారు. దళితబంధులో భాగంగా మొదటి విడుతలో 199 యూనిట్లు రూ.19.70 కోట్లతో గ్రౌండింగ్ చేస్తున్నామన్నారు. చేతివృత్తుల వారికి వందశాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించడం, 315 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్లు, పట్టణంలో 125 లీటర్ల సురక్షితమైన నీటిని అందిస్తున్నామన్నారు. మన ఊరు-మన బడి కింద మొదటి విడుతలో 183 పాఠశాలల్లో 911 పనులను రూ.79 కోట్లతో చేపట్టామన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇటీవలే జిల్లాస్థాయి క్రీడలను నిర్వహించి క్రీడాకారులను రాష్ట్రస్థాయికి పంపించామన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిథులు, ప్రజలందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తి, ప్రజాప్రతినిథులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.