జైపూర్: ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది.
ఆల్వార్ జిల్లాలోని ఓ గుడిలో జగదీశ్ అనే పూజారి పనిచేస్తున్నాడు. గత బుధవారం అతడిని ఓ మహిళ అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆమెతోవచ్చినవారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది గురువారం బాగా వైరల్ అయ్యింది. దీంతో మనస్థాపం చెందిన ఆ జగదీశ్ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని వైదులు చెప్పారు. కాగా, పూజారి కుమారుడు ఆ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ఆమె పూజారి గుడిలో తనను వేధించడాని కేసు పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.