చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పది వేల దిగువకు చేరింది. కరోనా మరణాలు మాత్రం వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 9,118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 210 మంది కరోనాతో మరణించారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,97,864కు, మొత్తం మరణాల సంఖ్య 30,548కు చేరింది. ప్రస్తుతం 1,00,523 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 22,720 మంది కారోనా రోగులు కోలుకున్నారని, కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,66,793కు చేరినట్లు వెల్లడించింది.