ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఏకదాటిగా ముసురువర్షం కురుస్తున్నది. దీంతో ప్రజలు గొడుగులు, రెయిన్కోట్ల సాయంతో బయటకు వస్తున్నారు.
మహబూబ్నగర్, జూలై 19 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముసురేసుకున్నది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉన్నది. వరదలు లేకపోయినప్పటికీ భూమి పదును అయినట్లు వాతావారణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావారణ శాఖ హెచ్చరించింది. ఈ ముసురుకు కొనసాగింపుగా భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలతోపాటు ప్రాజెక్టులకు వరద చేరుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కల్వకుర్తిలో 4.2 శాతం నమోదైంది. ముసురుతో రైతన్నలు వరి నాట్లలో బిజీబీజీగా గడుపుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.