మక్తల్ టౌన్, మార్చి 24 : గుర్తు తెలియని వ్య క్తులు ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన మక్తల్ పట్టణంలో ఆదివారం చో టు చేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మన్యంకొండ అనే విద్యాశాఖ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఎయిర్ కూలర్ పెట్టుకొని ఇం టి తలుపులు తెరిచి పడుకున్నాడు. ఆదివారం తెల్లవా రుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించారు.
ఉదయం లేచిన కుటుంబ సభ్యులకు బీరువా తెరిచి ఉండడం గమనించి వస్తువులు చూడ గా, బీరువాలో ఉన్న 12 తులాల బంగారం కనిపించలేదు. చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ చంద్రశేఖర్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి నిందితుల వేలి ముద్రలను పరిశీలించారు. మ న్యంకొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.