కందనూలుకు పెళ్లి కళ వచ్చింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నేతృత్వంలోని ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12నఉచిత సామూహిక వివాహాలు ‘న భూతో.. న భవిష్యత్’ అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన 220 పేద జంటలకు ఆయా మతాల సంప్రదాయానుసారం ఒకే వేదికపై శాస్ర్తోక్తంగా పెండ్లిండ్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే నాలుగు విడుతల్లో 482 జంటలను ఏకం చేశారు. మరోసారి వివాహ సౌరంభ వేడుకలు తిరిగి ఘనంగా ప్రారంభమయ్యాయి. గొప్పింట్లో జరిగే మాదిరి మెహిందీ, డ్యాన్సులు, పసుపుకొట్టడం వంటి కల్యాణ ఘట్టాలను జరిపించనున్నారు. ఇప్పటికే నూతన జంటలకు పట్టువస్ర్తాలను అందజేశారు. ఇంటింటికీ పెండ్లిపత్రికల పంపిణీ చేపట్టారు. వేలాది మంది తిలకించేలా వేదికను తీర్చిదిద్దుతున్నారు. 30 వేల మందికిపైగా అతిథులకు భోజనం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
– నాగర్కర్నూల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : సామాజిక సేవలో తన ప్రత్యేకతను చాటుకొన్న ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నెలకొల్పిన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉచిత సామూహిక వి వాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. జిల్లా కేం ద్రంలోని జెడ్పీ హైస్కూల్లో కల్యాణ వేడుకలకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పేదింటి ఆడపడుచులతోపాటు మిగిలిన మూడు నియోజకవర్గాలకు చెందిన కొద్ది మందికి కూడా వివాహాలు జరిపించాలని ఎమ్మెల్యే మర్రి నిర్ణయించారు.
ఈనెల 12న ఉదయం 10:05 గంటలకు ముహూర్తం కుదిరింది. గత నాలుగుసార్లకు భిన్నంగా ఈ సారి అత్యధికంగా 220 మంది జంటలకు హిం దూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల సంప్రదాయాల ప్రకా రం పెండ్లిళ్లు చేయనున్నారు. గతంలో నాలుగుసార్లు కలిపి 482 మందికి వివాహాలు జరిపించారు. తొలిసారిగా 2014 ఫిబ్రవరి 5న 84 జంటలకు, 2015 మే 22న 102, 2017 ఏప్రిల్ 20న 135, 2019 డిసెంబర్ 1న 165 జంటలకు సామూహిక వివాహాలు చే శారు. పెండ్లిళ్లు చేసుకునే జంటలకు పట్టువస్ర్తాలు, గా జులు, బాసింగాలు, తాళి, మెట్టెలతోపాటు ప్రతి జం టకూ బీరువా, బెడ్షీట్లు, రెండు కుర్చీలు, పీటలు వం టి దాదాపు రూ.లక్ష విలువైన వస్తుసామగ్రిని బహూకరించనున్నారు. పేదల పెండ్లిళ్లు కూడా పెద్దిండ్లల్లోగా ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే మర్రి భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
వేలాది మంది తిలకించేందుకు అనువుగా పెండ్లి వేదికను తీర్చిదిద్దుతున్నారు. వేడుకలకు వచ్చే 30 వేల మందికిపైగా అతిథులకు మాంసాహారం, కూరగాయలతో కూడిన విందు భోజనం ఏర్పాటు చేయనున్నా రు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచేలా వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పెండ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నూతన జంటలకు పట్టువస్ర్తాలను అందజే శారు. గొప్పింట్లో జరిగినట్లుగా మెహిందీ, డ్యాన్సులు, పసుపుకొట్టడం వంటి కల్యాణ ఘట్టాలను నిర్వహిస్తున్నారు. ఇంతకుమందు వివాహ వేడుకలకు మాజీ గవర్నర్ నరసింహన్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి ప్రముఖులు హాజరయ్యా రు.
ఈసారి కూడా ఈ వేడుకలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఉమ్మడి పాలమూరులోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇ తర స్థాయి ప్రముఖులు హాజరు కానున్నా రు. ఆహుతులకు భద్రత, విడిది ఏర్పా ట్లు చేపడుతున్నారు. మొత్తమ్మీద ఎంజేఆర్ ట్రస్ట్ చారిత్రాత్మక వి వాహాలతో కందనూలులో క ల్యాణకాంతులు నెలకొన్నాయి. వారం రోజు ల సంరంభం ఆదివారంతో ప్రారంభంకా నున్నది.
220 జంటలకు ఘనంగా పెండ్లిళ్లు..
ఈనెల 12న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నెలకొల్పి న ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు పెండ్లిళ్లు జరిపిస్తున్నాం. పేదల వివాహాలు ఘనంగా జరిపించడమే ఎమ్మెల్యే మర్రి లక్ష్యం. ఇప్పటివరకు నాలుగుసార్లు 486 జంటలకు వివాహాలు జరిపించాం. ఇంటింటికీ వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నాం. ఈ వేడుకలకు మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ పెండ్లి వేడుకలకు హాజరై నూతన జంటలను ఆశీర్వదించాలి.
– జక్కా రఘునందన్రెడ్డి, ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్