పాలమూరు, ఫిబ్రవరి 19 : పాలమూరు విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా (అంతకు ముందు ప్రధానమంత్రి ఉచ్ఛత్తల్ శిక్షా అభియాన్) రూసా (రాష్ట్రీయా ఉచ్ఛత్తర్ శిక్షా అభియాన్)తో పాటు మీరు పథకం ద్వారా రూ.100కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం పీయూ పరిపాలన భవనంలో ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. యూనివర్సిటీలో అన్నిరకాల మల్టీ కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు.
తాము పంపిన ప్రతిపాదనలను పరిశీలించి నిధుల మంజూరుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డితో చర్చించి విశ్వవిద్యాలయానికి మరో రూ.50 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని, పీయూ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని అన్నారు. కార్యక్రమంలో వోఎస్డీ డా.మధుసూదన్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.పిండి పవన్కుమార్, వివిధ విభాగాల ప్రిన్సిపాళ్లు డా.చంద్రకిరణ్, డా.సుజాత, డా.బషీర్అహ్మద్, డా.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.