నవాబ్పేట, ఫిబ్రవరి 16 : ఉద్యోగం వస్తుందని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి కుచ్చుటోపీ వేసిన సంఘటన నవాబ్పేట మండలంలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. కూచూర్కు చెందిన నాగరాజు ఈ నెల 4వ తేదీన ఫోన్లోని ఇన్స్ట్రాగ్రాంలో ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చూసి ఆ నెం బర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టాడు.
వెంటనే ఓ లింక్ రాగా లాగిన్ కావాలని అవతలి వ్యక్తి సూచించడంతో లాగిన్ అయ్యాడు. ఈ సైట్ లో పెట్టుబడి పెడితే రూ.లక్షలు సంపాదిం చ వచ్చని ఎర చూపాడు. దీంతో రూ.100 పెట్టు బడి పెట్టగా డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఆశకు పోయి పైసలు పెడుతూ చివరకు రూ.44వేల వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఇంకా పంపాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో అనుమానం వచ్చింది. 5వ తేదీన నాగరాజు యూపీఐ ఐడీ నుంచి రూ.లక్షా 90 వేలు ఖాళీ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తోచక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.