మహ్మదాబాద్, ఆగస్టు 9: తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గాధిర్యాల్లో సోమవారం మెగాపార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, నర్సరీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి పల్లెప్రగతి కార్యక్రమంలో పూర్తవుతున్నాయన్నారు. పట్టణాల్లో కనిపించే అభివృద్ధి గ్రామాల్లో చూస్తున్నామన్నారు. వీటితోపాటు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో ప్రజలు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి గండీడ్ మండలంలో వేల ఎకరాల్లో సాగునీరు అందుతుందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పథకంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అనంతరం 15ఫైనాన్స్ నిధుల నుంచి ఎంపీపీ మాధవి ఎమ్యెల్యే చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబందు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ రాములమ్మ, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, ఎంపీవో శంకర్నాయక్, పీఆర్ ఏఈ రాబర్టు, ఏపీవో హరిచంద్రుడు, నాయకులు రాజ్కుమార్రెడ్డి, రాంచంద్రారెడ్డి, అశోక్గౌడ్, బాలవర్ధన్రెడ్డి, వెంకటయ్య, భిక్షపతి, తిర్మల్రెడ్డి, రమేశ్రెడ్డి, కృష్ణ, హన్మయ్య, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.