బాలానగర్, ఆగస్టు 1 : అమ్మపాలు అమృతం వంటివి. నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడుతాయి. ప్రకృతి సిద్ధంగా ల భించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయి. పుట్టిన తరువాత గంటలోగా బిడ్డకు అందిం చే ముర్రుపాలు సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయి. అందుకే తల్లిపాలను అమృతంతో పోలుస్తారు. డబ్బా పా లు పట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరో నా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ పాలు ఎలా పట్టాలని అధికారులు బాలింతలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, తల్లి పాల వారోత్సవాలు ప్రతి ఏడాది ఆగస్టు 1 నుం చి నిర్వహిస్తారు. కానీ, ఈ సారి ఆదివారం వచ్చినందున సోమవారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కానున్నా యి. 7వ తేదీ వరకు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో అవగాహ న కల్పించనున్నారు.
తల్లిపాలతో ప్రయోజనాలు..
పుట్టిన గంటలోగా బిడ్డకు పట్టే ముర్రుపాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. లేత పసుపుపచ్చ రంగుతో కూడిన పాలను ఇవ్వడం వల్ల పసికందు మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, చర్మ సంబంధ వ్యా ధులు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్ రా కుండా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుం ది. ఆరు నెలలపాటు రోజూ బిడ్డకు 12 సార్లు తా గించాలి. స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువ.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
తల్లి పాలు అమృతంతో సమానం. బిడ్డను ప్రసవించిన అనంతరం ముర్రుపాలు పట్టించడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తల్లికి కూడా ఇన్ఫెక్షన్లు రావు. అలాగే తల్లికి రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్ వంటివి రావు. తల్లి పాలు పట్టించడంతో బిడ్డ మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఇందుకోసమే బిడ్డకు తల్లి పాలు పట్టించాలి.
టీకా కంటే గొప్పది..
దేవుడు సృష్టించిన తల్లిపాలు ఒక టీకా కంటే చాలా గొప్పవి. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా పని చేస్తాయి. ఈ పాలల్లో ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. తల్లిపాలు బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతాయి. ప్రసుత్తం పిల్లలకు పాలు పట్టే ముందు తల్లులు చేతులను శుభ్రం చేసుకోవాలి. తల్లి పాలు బిడ్డ శారీరక, మానసిక, ఎదుగుదలకు దోహదపడుతాయి.