నారాయణపేట, మే 13 : రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మ న్లు నారాయణపేట పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని మీ పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో పట్టణప్రగతి అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
నారాయణపేట పట్టణం గతంలో చూసినప్పుడు, ఇప్పటికీ పోలికే లేదన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ అనసూయ టీయూఎఫ్ఐడీసీవో, పట్టణప్రగతి నిధుల ద్వారా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారన్నారు. మే 20నుంచి జూన్ 5వరకు నిర్వహించనున్న పట్టణప్రగతిని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందె అనసూయ, కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు.