మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 18 : ప్రభుత్వం పశుసంపదను కాపాడేందుకు ముందస్తు చర్యగా అందజేస్తున్న గాలికుంటు నివారణ టీకాలను ప్రతి రైతు పశువులకు ఇ ప్పించాలని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి సూచించారు. మండలంలోని పొన్నకల్, కందూరులో గాలికుంటు నివార ణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ సోమవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ సీజనల్వ్యాధుల నుంచి పశువులను కాపాడేందుకు పశువైద్యాధికారులు టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఆయా గ్రామాల పా డిరైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రాంప్రసాద్, విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేటలో..
మూసాపేటలో పశువులకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ మ ధుసూదన్, వైద్య సిబ్బంది, రైతుబంధు మండలాధ్యక్షుడు భాస్కర్గౌడ్, పాడి రైతులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
భూత్పూర్, అక్టోబర్ 18 : గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ కోరారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని పశువైద్యశాలలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం పశు సం పదను పెంచాలనే లక్ష్యంతో ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాడిరైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి మధుసూదన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణగౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 18 : మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని పశు వైద్యాధికారి శ్రావణి అ న్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లి, అ య్యవారిపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు సునీత, దేవేందర్, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కొండాపూర్లో పశువైద్య శిబిరం
నవాబ్పేట, అక్టోబర్ 18 : మండలంలోని కొండాపూర్లో సోమవారం పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశువైద్య శి బిరాన్ని నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డా.రవిచంద్ర శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత సీ జన్లో మూగజీవాలకు గాలికుంటు వ్యాధి అధికంగా సోకే అవకాశం ఉన్నందున రైతులు తమ పశువులకు టీకాలు వే యించుకోవాలని సూచించారు. 280 పశువులు, 224 బర్రెలకు టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స ర్పంచ్ బొజ్జమ్మ, సిబ్బంది రాజేశ్, శ్రీవాణి పా ల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, అక్టోబర్ 18 : పశువైద్య శిబిరాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి వంశీకృష్ణరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఐనాపూర్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ టీకాల పంపిణీ శిబిరం నిర్వహించి పశువులకు మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పశుపోషకులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో..
మాగనూర్, అక్టోబర్ 18 : గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ అధికారి వినయ్ అన్నారు. మండలంలోని మందిపల్లిలో పశువుల కు ఉచితంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 17వ తేదీ వరకు పశువులకు టీకా లు వేస్తామని, అవకాశాన్ని పశుపోషకులందరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజమ్మ, జూనియర్ వెటర్నరీ అధికారి యశోద, గోపాలమిత్ర నాగ ప్ప, పశుపోషకులు పాల్గొన్నారు.