నాగర్కర్నూల్, మార్చి 31 (నమస్తే తెలంగా ణ) : ఉమ్మడి మహబూబ్నగర్లోని ఐదు గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ పం చాయత్ సతత్ వికాస్ పురస్కార్ పేరిట ఏటా ఆ యా గ్రామ పంచాయతీల్లో ఆరోగ్యం, పేదలకు ఉ పాధి కల్పన, పిల్లల స్నేహ పూర్వక, నీటి సదుపా యం, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, పారిశుధ్యం, గ్రామ పరిపాలన, మహిళ సంక్షేమం వం టి తొమ్మిది అంశాలకుగానూ ఆయా జిల్లాల్లో ప్రతి అంశం నుంచి మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఆయా విభాగాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని బట్టి రా ష్ట్రంలో 47 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యా యి. ఇందులోని గ్రామాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను శుక్రవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాల య ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మం త్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి చేతుల మీదుగా సర్పంచ్లు, అధికారులకు అ వార్డులను అందజేశారు. కాగా ఈ తొమ్మిది అం శాల్లో జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో పేదరికం లేని మెరుగైన జీవనోపాధి వంటి ఒకే అంశానికి ఎంపికయ్యాయి. ఇందులో రాజోళి మంమడ లం మాన్దొడ్డి గ్రామం, ఖిల్లాఘణపురం మండ లం సోలీపూర్ పంచాయతీలు ఉండగా.., పిల్లల స్నేహ పూర్వక (చైల్డ్ ఫ్రెండ్లీ) విభాగంలో నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని అల్లాపూర్ గ్రామం, స్వయం సహాయక సమృద్ధి విభాగంలో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి, పరిపాలన విభాగంలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రా మ పంచాయతీలు ఎంపికయ్యాయి. జాతీయ స్థా యిలో పురస్కారం లభిస్తే ఒక్కో పంచాయతీకి రూ.40లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయి.
చైల్డ్ ఫ్రెండ్లీ ‘అల్లాపూర్’
నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి పు రస్కారానికి ఎంపికైంది. జిల్లాలో 461 గ్రామ పం చాయతీలు ఉండగా.. ఆయా విభాగాల్లో 27 పం చాయతీలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో అల్లాపూర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయి పురస్కార పోటీల్లో నిలిపింది. ఏడాది కాలంలో గ్రామంలో పిల్లలు, విద్యార్థులకు కల్పించిన వసతులు, ఫలితాల్లో వచ్చిన మార్పును అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీలల్లో వివిధ రకాల అభివృద్ధి చర్యలు, వసతులను కల్పించారు. విద్యార్థులకు న్యూట్రిషన్ ఆహారం అందిస్తున్నారు. అంగన్వాడీలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందులో సేంద్రియ ఎరువులతో పండిం చే కూరగాయలనే వండుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు, తల్లులకు మంచి పౌష్టికాహారం లభిస్తున్న ది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పాలు, గుడ్లతో కూడిన భోజనం, మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా రెండు సార్లు ఆరోగ్య శిబిరాలు ఏర్పా టు చేస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతల్లో ర క్తహీనత శాతం తక్కువైంది. ప్రతి నెలా రికార్డుల పరిశీలన, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, తల్లుల కోసం ప్రత్యేకంగా టాయ్లెట్లను నిర్మించారు. పిల్లలకు జారుడుబల్ల, బంతు లు వంటి ఆటవస్తువులను అందుబాటులో ఉంచా రు. దీంతో పిల్లలకు పాఠశాలపై ఆసక్తి పెరిగింది. బాల సభ నిర్వహిస్తూ ప్రజలకు సమాజంపై ఆసక్తి కలగజేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు వంద శాతం ఇమ్యూనైజేషన్ చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాల్, ఆట స్థలం, లైబ్రరీ, టాయిలెట్లు నిర్మించారు. గ్రామంలోని 0-6 ఏం డ్లలోపు 109 మంది పిల్లలందరికీ వ్యాక్సిన్ వే యించారు. ఎనీమియా కేసులు ఒక్కటీ లేవు. 18 ఏండ్లలోపు పిల్లలు 292 మంది ఉంటే.. ఒక్కరు కూడా బడిబయట లేకపోవడం విశేషం. 49 ఏండ్లలోపు గర్భిణులు, బాలింతల్లో 70 మందిలో ఒక్కరికీ ఎనీమియా లేదు. ఇక 50 మంది కలిసి రెండు అంగన్వాడీలు, పాఠశాలను పునరుద్ధరించారు. ఈ భవనాలను చక్కని వసతులతో అందుబాటులోకి వచ్చాయి. కలెక్టర్ ఉదయ్కుమార్ ప ర్యవేక్షణతో అంగన్వాడీ, పంచాయతీ, వైద్య, వి ద్యా శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామంలో 1,598 మంది జనాభా ఉన్నా రు. అందులో 0-6 ఏండ్ల చిన్నారులు 109, 6-18 ఏండ్లలోపు 292 మంది ఉన్నారు. పాఠశాల లో 90, అంగన్వాడీలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. అక్షరాస్యతా శాతం 52.54గా ఉన్నది.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
అల్లాపూర్.. చైల్డ్ ఫ్రెండ్లీ పం చాయతీగా ఎంపిక కావడం సంతోషంగా ఉన్నది. విద్యార్థు ల తల్లిదండ్రులు, గ్రామ పం చాయతీ, ఆశ, అంగన్వాడీ, వై ద్యులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరి సహకారంతో గ్రామం జాతీయ స్థాయికి ఎంపికైంది. పాఠశాలలో విద్యార్థులకు యోగా తరగతులు, ప్రత్యేకంగా టాయ్లెట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్, అంగన్వాడీలో తల్లులకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేశాం. దీంతో విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గాయి.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్
పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం..
పాతగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని కొత్తగా నిర్మించారు. పిల్లలకు ప్రీ స్కూల్ కిట్ అందించారు. ఇందులో బాల్స్, యూకేజీ, ఎల్కేజీ పిల్లలకు వర్క్ బుక్స్, జారుడు బండ, డ్యాష్ బోర్డు, చెప్పుల స్టాండ్ ఇచ్చారు. తల్లుల మీటింగ్ నిర్వహిస్తున్నాం. మంచి పౌష్టికాహారం అందజేస్తున్నాం. నెలనెలా హెల్త్ క్యాంపులు నిర్వహించి మందులు అందిస్తున్నాం. దీంతో రక్తహీనత తగ్గిపోయింది. పిల్లల డ్రాపౌట్లు లేవు.
– శారద, అంగన్వాడీ కార్యకర్త, అల్లాపూర్