అచ్చంపేట, ఫిబ్రవరి 15 : దేశం గ ర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థ లంతోపాటు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చి.. మంత్రి సత్యవతిరాథోడ్ చే తులమీదుగా ఆలయ నిర్మాణానికి శం కుస్థాపన చేసుకుందామన్నారు. అచ్చంపేట పట్టణంలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అధికారికంగా వేడుకలు నిర్వహించా రు. మేరామ అమ్మవారు, సేవాలాల్ చి త్రపటాలతో గిరిజన భవనం వరకు ఊ రేగించారు. సంప్రదాయబద్ధంగా బావోజీలు, మహిళలు, గిరిజనులతో ర్యాలీ చే పట్టగా.. విప్ గువ్వల నృత్యాలు చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వే సి నివాళులర్పించారు. అనంతరం గిరిజన భవనం వద్ద బావోజీలు, బంజారు లు మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఉత్సవ కమిటీ చైర్మన్, రంగాపూర్ స ర్పంచ్ లోక్యానాయక్ అధ్యక్షతన జరిగి న సమావేశంలో విప్ గువ్వల ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. అట్టడుగుస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రతి రంగంలో బంజారాల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. గిరిజనుల నమ్మకం, విశ్వాసం మరింత బలపడేలా అచ్చంపేటలో కోట్ల విలువైన ఎకరా భూమితోపాటు సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అచ్చంపేట మండలం చెంచుపలుగు తండాలో సీసీ రోడ్లకు రూ.30 ల క్షలు, జీపీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. హా జీపూర్ వద్ద బావోజీ చందులాల్ ఆ లయ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తాన ని ప్రకటించారు. అనంతరం గిరిజను లు విప్ గువ్వల బాలరాజును సత్కరించారు. ఉద్యోగులు, మహిళల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మంత్రియానాయక్, రాం బాబు, భరత్, ఎంపీపీ శాంతాబాయి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ చైర్మన్ తులసీరాం, గిరిజన సంఘం నా యకులు, ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళలు బిచ్యానాయక్, దేశ్యానాయ క్, గోపాల్నాయక్, జైపాల్నాయక్, హ తీరాంనాయక్, సోమ్లానాయక్, బోడ్క, శంకర్, పర్వతాలు, లలిత, శ్యామల, మణి, ప్రియాంక, సాలి, బాలు, హ న్మంతు, మంగ్యా, చందులాల్, తులసీ రాం, సాల్యబావోజీ, రాజేశ్వర్రెడ్డి, రా జీరెడ్డి, వసూరాం, వంశీ, బాలు, రా ములు, కృష్ణ, శ్రీనునాయక్ ఉన్నారు.