వనపర్తి రూరల్, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో పాడి, పశుసంపద, జీవాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలో పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉన్నదని, దానికి తగ్గటుగా యూనిట్లు కూడా అందించేలా కృషి చేస్తామని చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో గొర్రెల మార్కెట్ స్థలాన్ని, ప్రాం తీయ పశువైద్య శాల భవన నిర్మాణ పనులను మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములుతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడు తూ జిల్లాలో పశు, జీవాల కోసం రెండు ఎకరాల స్థలంలో సంత ఏర్పాటుకు నిధులు అందిస్తామన్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నూతన ప్రాంతీయ పశువైద్యశాల భవన నిర్మాణ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడారు. గొర్రెల పంపిణీలో పెండింగ్ ఉన్న వాటితోపాటు కొత్తగా అమలు చేసి గొర్రెల యూనిట్ పాలసీకి డీ డీ కట్టించాలని సూచించారు. దసరా పండుగ తర్వాత గొర్రెల పంపిణీ మేళ నిర్వహిస్తామన్నారు. దిశ స్మృతివనం, పశుగ్రాస క్షేత్రాన్ని మంత్రులు ప్రారంభించారు. స్మృతివనంలో మొక్కలు నాటారు. అలాగే కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వరావుపేటలో ఆయిల్పాం తోటల సాగుపై రైతుల క్షేత్ర విజ్ఞాన యాత్రను మంత్రులు ప్రారంభించారు. పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విజ్ఞాన యాత్రలు ఎం తగానో ఉపయోగపడుతాయని చెప్పారు. తర్వాత మంత్రులను పలువురు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య అధికారి కవిత, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్, గొర్రెల కాపరుల సహకార సం ఘం వైస్ చైర్మన్ చంద్రయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.