ఊట్కూర్, డిసెంబర్ 3 : దివ్యాంగులు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలని నిడుగుర్తి యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగు ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సబార్డినేటర్ చంద్రకాంత్ను ఉపాధ్యాయులు పూలమాల, శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఐఆర్పీలు తౌసిఫ్, తిమ్మప్ప సమగ్ర సర్వశిక్ష అభియాన్ నుంచి అందించే సం క్షేమ పథకాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, డిసెంబర్ 3 : దివ్యాంగులు స్వతహాగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని సింగార్భేస్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చెన్నయ్య అన్నారు. ప్రపంచ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవిత కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అవసరాలు పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దివ్యాంగు ల సేవయే విశ్వమానవతా సేవ అన్నారు. ది వ్యాంగులు ఎక్కడ కనిపించిన సహాయ స హకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఎండీ విద్యాసాగర్, భవిత కేం ద్రం నిర్వాహకుడు శ్రీనివాస్, సీఆర్పీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వికలత్వం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని డీఆర్డీవో గోపాల్నాయక్, మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ ది వ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నైపుణ్య శిక్షణా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ 155326 ఏర్పాటు చేసిందని, నెంబర్కు కాల్ చేసి వారికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయిలో దివ్యాంగ క్రీడాకారులకు నిర్వహించిన మూడు చక్రాల సైకిల్తో పరుగుపందెం, చెస్, షార్ట్ఫుట్, క్యారమ్స్ తదితర క్రీడల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి నరేశ్, రషిత క్రీడాకారులు పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఏవో జాన్సుధాకర్, ఎఫ్ఆర్వో సాయి, దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
ఊట్కూర్, డిసెంబర్ 3 : ప్రభుత్వం దివ్యాంగులకు అందజేస్తున్న సదుపాయాలు దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ అన్నా రు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని మండల వనరుల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం ఎంఈవో ఆధ్వర్యంలో దివ్యాంగుల కు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చే శారు. దివ్యాంగుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హలీమా బేగం, ఉపాధ్యాయులు, ఆర్పీలు, ఎంఆర్సీ సి బ్బంది, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.