మక్తల్ టౌన్ , డిసెంబర్ 1: పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. డిసెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను గురువారం ఆంజనేయస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త భీమాచార్య, కార్యనిర్వహణ అధికారి శ్యాంసుందరాచారి ఎమ్మెల్యే చిట్టెం ఇంటికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీ వరకు జరిగే అంజన్న బ్రహ్మోత్సవాలను కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు భారీ స్థాయిలో హాజరవుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్శాఖ సహాయాన్ని తీసుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని సూచించారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం రోజు నుంచి ముగిసేవరకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని ఆలయ అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ర్టాలతోపాటు హైదరాబాద్, మ హబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూ డాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ తిరుపతయ్య తదితరులు ఉన్నారు.
పేదలకు అండ సీఎంఆర్ఎఫ్
మక్తల్టౌన్, డిసెంబర్ 1: పేద ప్రజల ఆరోగ్య రక్షణకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ అద్భుతంగా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎంఎఫ్ఆర్ నుంచి మంజూరైన చెక్కులను గురువారం ఎమ్మెల్యే చిట్టెం తన గృహంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల, సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ అమలు చేస్తున్నారన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం పథకానికి అర్జీ పెట్టుకున్న మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన హన్మంతు కు రూ.11వేల విలువ చేసే చెక్కును అందజేశారు.