మరిపెడ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన బండాప్రకాశ్ను గురువారం జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు పిట్టల ధనుంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందజేయటం, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల అందించారన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగిందన్నారు. రాజకీయంగానూ తమ సామాజిక వర్గానికి సముచితమైన స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బయ్య ఉపేందర్ పాల్గొన్నారు.