‘కవిత్వం అవసరమే ..కానీ ఎందుకో తెలిస్తే !’ అని ఓ రచయిత ఛలోక్తి విసిరాడు . మోండ్రియాన్ అనే చిత్రకారుడు యదార్థ్ధం క్రమేణా కళను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తుందని అభిప్రాయపడ్డాడు. యదార్థ్ధంలో లోపించిన సమతుల్యతకు ప్రత్యామ్నాయంగా కళ జనిస్తుందనేది అతని వాదన. అయితే కళ ఆవశ్యకత ఎల్లప్పుడూ ఉంటుంది.
జీవిత ప్రత్యామ్నాయంగా కళ, మనిషి చుట్టూ ఉన్న ప్రపంచంతో ఒక సమతుల్యతను ఏర్పరుస్తుందనే భావన కళ స్వభావాన్ని, దా ని అవశ్యకతను రేఖామాత్రంగా సూచిస్తోంది. ఈ భావన గతంలో కళ ఎంత అవశ్యకమో, నేటికీ అంతే అవసరమ ని నొక్కి చెబుతోంది. కళ మనిషికీ, జ గత్తుకూ మధ్యగల అనుబంధాన్ని వ్య క్తీకరిస్తుంది. మనిషి ఆంతరంగిక అవసరాలను కళ సంతృప్తి పరుస్తోంది .
చాలామంది పుస్తకాలను చదువుతారు, సంగీతాన్ని ఆనందిస్తారు, సా హిత్యాన్ని ఆస్వాదిస్తారు. వారు మానసిక ప్రశాంతతను, వినోదాన్ని ఇలా కళను అనుభవించడం ద్వారా పొందుతారు. సాహిత్యాన్ని చదివే సమయంలో ఎందుకు వారు ఆ సాహిత్యంలోని పాత్రలతో తా దాత్మ్యం చెందుతారు? ఆ పాత్రల సమస్యలకు, సవాళ్లకు ఎందుకు స్పందిస్తారు? ఆ సాహిత్యంలోని జీవితం వాస్తవం కానప్పటికీ, ఆ కల్పనను గాఢమైన యధార్థంలా ఎందుకు అనుభూతి చెందుతారు ? ఇందులో ఎలాంటి విచిత్రమైన వినోదం, ఆనం దం దాగి ఉంది? అంటే ఒక వేళ మనం మన జీవితం నుంచి ఆ కాల్పనిక ప్రపంచంలోకి వెళ్ళి మనలను మనం మర్చిపోతాం అని సమాధానం చెప్పవచ్చు. అప్పుడు ఎందుకు మన జీవితం మనకు సరిపోవడం లేదనే ప్రశ్న వస్తుంది. ఇతర కాల్పనిక పాత్రలను చిత్రీకరింపబడిన జీవితాన్ని చదువటం వల్ల మన జీవితంలోని పరిమితులను, అసంతృప్తిని ఎలా పోగొట్టుకుంటున్నాము అనే ప్రశ్న కూడా వస్తుంది.
ఇందుకు సమాధానంగా మనిషి తన జీవిత పరిమితులను అధిగమించి ఓ సంపూర్ణత్వం పొందేందుకు, సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాడు అని చెప్పవచ్చు. అతను తన జీవిత పరిమితులను, బలహీనతలను అధిగమించి, తనను తాను మరింత బలవత్తరం చేసుకునేందుకు సాహిత్యం ఉత్తేజం కలిగిస్తుందని చెప్పవచ్చు.తాను ఇతరులతో, వారి జీవితాలతో తాదాత్మ్యం చెంది, తన సొంత వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట పొందుతాడు.తాను వ్యక్తిగా చే యలేనివి, సాహిత్యంలోని పాత్రల నుంచి స్వీకరించి, ప్రేరణ పొంది సం తృప్తి చెందుతాడు. తాను తన ఏకాకిత నం నుంచి, సమాజ సమూహంతో మ మేకం చెందడం ద్వారా, సంపూర్ణత్వా న్ని పొందుతాడు. తాను ఇతరులతో కలిసి ఉండాలనే సామాజిక వాంఛ నుంచి ఇలా సాహిత్యం నుంచి, జీవితంతో అనుబంధం ఏర్పరుచుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు.
కళ వ్యక్తిని అతని జీవితం నుంచి తా త్కాలికంగా వేరుపరిచి, ఒకరకమైన మాంత్రిక స్థితిని సృష్టిస్తుంది. వ్యక్తి తన నుండి తాను వేరుపడి, ఆ కాల్పనిక ప్రపంచంతో తాదాత్మ్యం చెందడం ద్వారా, తిరిగి తన శక్తిని పుంజుకుంటాడు. ఆ స్థితి తాత్కాలికమే అయినప్పటికీ అది అతనికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. కళను మనిషి వ్యక్తిగతంగా ఆస్వాదించినా, అందులో విశ్వజనీనమైన అనుభూతిని పొందుతాడు. అలా కళ మనిషిని తన పరిమితులను అధిగమించి, ఒక సంపూర్ణత్వం పొందేలా దోహద పడుతుంది. మనిషిని సమాజంతో ఐక్య పరుస్తుంది. తనకు ప్రపంచానికి మధ్య ఓ నిరంతర సమతుల్యత సాధించేందుకు ప్రేరేపిస్తుంది. అందువల్లే మనిషి కళ నుంచి ఆనందం పొందుతాడు. కళలను ఆస్వాదిస్తాడు, కళ మనిషికి అన్ని కాలాల్లో నూ అవసరం. కళ మనిషిని మనీషిగా మలుస్తుంది !
దండమూడి శ్రీ చరణ్
98661 88266