హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం సెప్టెంబర్ 1న 125 స్థాపన దినోత్సవం జరుపుకుంటున్నదని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ కార్యదర్శి టి.ఉడయవర్లు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో సుప్రసిద్ధ రచయిత్రి, కవయిత్రి డా.తిరునగరి దేవకీదేవికి రావిచెట్టు లక్ష్మీనర్సమ్మ పురస్కారాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేస్తారని పేర్కొన్నారు.