మన సంస్కృతి, సంప్రదాయం మొదలయ్యేది గుడి నుండే. ఎందుకంటే గుడిలో ఎన్నో విషయాలు చెప్తారు. భక్తికోసం గుడికి వెళ్ళినా పురాణాలు, ప్రవచనాల ద్వారా మనకు తెలియచేస్తుంటారు. బతుకమ్మ ఆడుతారు,పాడుతారు. వీటితో బతుకమ్మ గురించి వివరిస్తారు. పువ్వులతో పూల పండుగ జరుపుకుంటారు. వారు పాడే పాటలన్నీ మన సంస్కృతిని చాటేవే. మన చేతలకి సంబంధించినవే.
గుడి తర్వాత చెప్పుకోవలసింది బడి. చెప్పాలంటే, పిల్లలందరికీ సరదా. బడిలో పంతులమ్మలు చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎప్పుడూ పాఠాలతో కుస్తీ పట్టే పిల్లలు మార్పును కోరుకుంటారు. ఊరంతా తిరిగి పూలను సేకరించి, అంచెలంచెలుగా, దొంతరలుగా పేర్చి సంతోషిస్తారు. కొత్తబట్టలు వేసుకుని ఊరి కూడళ్ళలో, గుళ్లలో వాటిని ఒకచోట పెట్టి, చప్పట్లు కొడుతూ, గుండ్రంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ ఆనందిస్తారు. పెళ్ళి చేసుకుని అత్తారిండ్లకు వెళ్ళిన కూతుర్లు తప్పకుండా తమ పుట్టినింటికి వచ్చి తమ తమ స్నేహితురాళ్లను కలుసుకొని బోలెడు కబుర్లను కలబోసుకుంటా రు. మగవారు, యువకులు అంతా వీరిని నయనానందకరంగా చూసి ఆనందిస్తారు.
ఇక మడులు… సమాజానికి అందించే సరంజామా అంతా మడి పేరుతో ఉన్న తోటలు, పొలాలు, అడవుల రూపంలో ఇస్తాయి. పిల్లలు చేలు, చెలుకలు, అడవులు తిరిగి పూలు సేకరిస్తారు. బతుకమ్మకు సంబంధించి ఏ పూలు తేవాలో పెద్దలు చెప్తారు. అవన్నీ తెచ్చి కుప్పలుగా పోసి అందంగా బతుకమ్మ ను పేరుస్తారు. ఈపనిలో చిన్నా పెద్దలంతా పాల్గొంటారు. మగవారు కూడా వారి సాయాన్ని అందిస్తారు. సాయంత్రం అలా అలంకరించిన బతుకమ్మలను పట్టుకుని ఆడవారంతా ఒక కూడలికి చేరి, అక్కడ వెంపలి చెట్టును మధ్యలో పెట్టి దానిచుట్టూ గుంపులు గుంపులుగా గుండ్రంగా తిరుగుతూ ఆడుతూ, పాడుతూ, ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటూ బతుకమ్మను చెరువులో ఒదిలి దాని మీద ఉన్న పసుపు గౌరమ్మను ఓలలాడిస్తూ ఆ పసుపు ముద్దను ముత్తుదువులకు పంచుతారు, లేదా వారి వారి ఇండ్లకు తీసుకెళ్తారు. కష్టాలు తొలగాలని, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టింటివారి ఆదరాభిమానాలు పుష్కలంగా ఉండాలనీ బతుకమ్మను వేడుకుంటారు. ఈవిధంగా మన సంస్కృతిని, సంప్రదాయాలను తెలియచేయాలంటే గుడి, బడి, మడి ఎంతో దోహదపడతాయి. సాధారణంగా తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణంలోనూ ఇదేవిధంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుపుకుంటారు.
( అక్షరయాన్ సౌజన్యంతో)
కలం పిలుపు
జాతీయ సదస్సు
ఏవీ కళాశాల, తెలుగుశాఖ, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయు క్త నిర్వహణలో ‘చాటువులు-చమత్కారాలు-సమాలోచన’ జాతీయ సదస్సు అక్టోబర్ చివరి వా రంలో జరుగుతుంది. ఈ సదస్సుకు దేశంలోని ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థుల నుంచి పరిశోధన పత్రాలను కోరుతున్నారు. సెప్టెంబర్ 30లోపు chatuvulu.chamatkaralu. 2023@gmail.comకు పంపాలి. వివరాలకు 93472 25379లో సంప్రదించగలరు.
-డా.వై.సత్యనారాయణ
సారంగ కథల పోటీ
సారంగ వేదికగా వరల్డ్ కైండ్ సంద ర్భంగా ‘టాల్’ రేడియో కథల పోటీ నిర్వహిస్తు న్నది. కథలు సహానుభూతి, సాయం, సేవ లాంటి మానవతా విలువలు ప్రతిబింబించాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 5 కన్సోలేషన్ కథలకు నగదు బహుమతులు ఉంటా యి. కథ నిడివి 1600 పదాలకు మించకుండా ఉండాలి. కథలను అక్టోబర్ 15లోగా info @ talradio.orgకు మెయిల్ చేయాలి.
– సారంగ, టాల్ రేడియో
కథల పోటీ ఫలితాలు
యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో సింహప్రసాద్ సాహిత్య సమితి నిర్వహించిన శ్రీశ్రీ స్మారక కథల పోటీ ఫలితాలను ప్రకటించింది. వెంకటశివకుమార్ (చివరిచూపుకోసం) హైదరాబాద్, భాస్కరచారి కశివొజ్జల (అగ్గిపుల్ల) వరంగల్, మల్లారెడ్డి మురళిమోహన్ (రెండు అగ్గిపుల్లలు చెప్పిన కథ) విశాఖపట్నం విజేతలుగా నిలిచారు. వీరికి అక్టోబర్ 14న హైదరాబాద్ రవీంద్రభారతిలో బహుమతులు అందజేస్తారు.
– సింహప్రసాద్ సాహిత్య సమితి