ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో కులాలు, వర్గాలు, వాదాలుగా తమ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. సాహిత్యంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని బలంగా రాసి సంకలనాలుగా ముద్రించాయి. మంగలి అస్తిత్వ సాహిత్యం ప్రత్యేకంగా ఇప్పటికీ రాలేదు. ఇప్పటి వరకు ‘అడపం’ పేరుతో డాక్టర్ తుమ్మల రామకృష్ణ కథా సంకలనం తెచ్చిండు. బీసీలు, ఇతర మిత్రుల కవితా సంపుటాలలో, సంకలనాలలో క్షౌరవృత్తి, వాయిద్య, వైద్య సాహిత్యం నమోదైంది. కొందరు కవులు, రచయితలు కుల అస్తిత్వ అనుభవం నుంచి రాసిండ్రు. మరికొందరు కవులు కులేతర సానుభూతితో పద్యాలు కవితలు, పాటలు, నవల, పరిశోధన వ్యాసాలు, కథలద్వారా వృత్తి ప్రాధాన్యాన్ని చిత్రీకరించారు.
కల్వకోల్ మద్దిలేటి ‘మా మంగళన్న’, కాకం అంజన్న ‘మంగలి’,యోచన ‘నాయీబ్రాహ్మణులు’, కొలకలూరి ఇనాక్ ‘తలలేనోడు’, రాప్తాడు గోపాలకృష్ణ ‘పల్లె మంగలి కథలు’ వంటి కథలు, ముదిగంటి సుజాతరెడ్డి ‘సంకెళ్లు తెగాయి’ నవల, నాటికలు క్షురకుల జీవితాలను, తొలివైద్య ఘనతను, వాయిద్య సొగసులను స్పృశించాయి.
ప్రపంచీకరణలో మానవుడు తన ఉనికిని తాను వెతుక్కుంటున్నాడు. చరిత్రలో తను కోల్పోయిన స్థానాన్ని, తన జాతి మూలాల్ని, హక్కుల్ని, పొందవలసిన గౌరవాన్ని ఇప్పుడిప్పుడే గొంతెత్తి చాటుతున్నాడు. విద్య, సామాజిక రాజకీయ రంగాలలోనే కాదు సాహిత్య రంగంలోనూ వెనుకబడినకులం మంగలి నాయీబ్రాహ్మణులే. తెలుగు సాహిత్యంలో మంగలి కులవృత్తి జీవితాలపై ఒక కవితా సంకలనం రాలేదంటే సాహిత్యం లో వారెంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతున్న ది. బీసీకవుల సాహిత్యాన్ని పరిశీలిస్తే వారి వృత్తి బాధలు మనకు అర్థమవుతాయి.
అగ్రహారంలోనే కాదు. మంగలి అసిపె (పొది)లోనూ సాహిత్యం నక్షత్రాలై మెరువాలి. అక్షరాలు అక్షరంతో ఢీ కొనాలి. కత్తుల్ని కలాలుగా మలవాలి. తరతరాల వెనుకబాటు, వివక్షను ఎదుర్కోవాలంటే విస్తృతంగా సాహిత్యాన్ని నాటాల్సిందే.
కులపరంగా సాంఘిక వివక్ష. కులం పేరు మార్చుకుంటే పెరిగిన గౌరవం, ఆదాయం ఎలాంటిదో ఎరుక చేస్తూ, పరాయీకరణను బద్దలు చేస్తూ, అగ్రవర్ణ భావజాలాన్ని బలంగా ప్రశ్నించారు ఉ.సాంబశివరావు (ఉ.సా.) కొండమంగలి కత్తి కవితలో. వాడి పేరు చివర కులం పేరు అలంకార భూషణం/నా పేరు చివర కులం పేరు అవమాన ఘోష ణం అంటారాయన. జీ.శివరామకృష్ణ తన గోరుగల్లు కవితలో..‘పొద్దు పాము తరుముతుంటే పరిగెత్తి పోయి / పరుపుమీద ఇంకా పొర్లాడుతున్న వాడి గుమ్మంలో గంటనై మోగాలా/..అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.
కవి సీతారాం తన ‘ఓట్లు ఓట్లో నాయీబ్రాహ్మ ణ ఓట్లోయ్’ అనే కవితలో ‘నా గుండె మంగలి కత్తి నూరే రాయై పోయింది’ అని ఆవేదన చెందుతాడు. జీ.లక్ష్మీ నరసయ్య (వరదయ్య) ఇరుసు విరిగిన బండి కవితా సంపుటిలో ‘కలలు సానబట్టుకుంటూ’ అనే కవితలో ‘నేను పొ లం జేస్తే పైరుకు బదులు బొచ్చు కత్తులు పొడుచుకు నిలబడుతాయని/మీరంతా చక్క గా సెలవిచ్చారు/మీకు థాంక్స్/ ‘చాకలి మంగలి పొత్తు/ఇంటికి రాదిత్తు’/అని అంత్య ప్రాస ను అందంగా నాటిన / పండితులారా.. అంటూ ఆవేదనాత్మక స్వరమై ప్రశ్నించాడు.
జీ.విజయలక్ష్మి రాసిన ‘పొది’ కవితలో మంగ లి వెంకటిగాడివి నువ్వు / కొండమంగలి గాడి పెళ్లాన్ని నేను/నాయీబామ్మడివే /అన్యాయం అని అరువలేవు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. డాక్టర్ రాపోలు సుదర్శన్ ‘సృష్టిలో ఏ బిడ్డకైనా మంత్రసాని మంగలి మహిళనే పురుడు పోసేది. పురుడు పోసుకున్న ప్రతిబిడ్డ ఈ భూ మ్మీద తొలిసారి చూసింది మంగలి స్త్రీనే.’ అని తన ‘అమంగళం’ అనే కవితలో బలంగా ధిక్కార చైతన్య కవిత. చెప్పిన ‘ఔ మల్ల మా అయ్యన్నట్టే అన్ని మారినయ్/మా అయ్య వాడిన మంగలి కలప జాడ లేకుండా పోయింది/పాతకాలపు కత్తు లు, గోరుగాల్ మారి ట్రిమ్మర్లు అచ్చి న య్’ అంటూ ఆధునికీకరణ వల్ల వచ్చిన మా ర్పులను సొన్నాయిల కృష్ణవేణి ‘మారని బతుకు’ కవితలో ఏకరవు పెట్టింది.
వనపట్ల సుబ్బయ్య (వ్యాసకర్త) నాది ఊరుమ్మడి సేవలో తేలే కుర్చీ/నా కుర్చీది సామాజిక సేవాభావం/నాది కష్టజీవుల చమట చుక్కల కుర్చీ/ అరవై ఏండ్ల అసెంబ్లీలో స్థానం లేని కుర్చీ అంటూ చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు స్థానం దక్కని విషయాన్ని ప్రస్తావిస్తారు. రడం రడమైన పుండ్లకు/పసరు పూసిన తొలి వైద్యులు/చింపిరి ఎంట్రుకల ఎంట్లు కత్తిరించి/నున్నా బాలు దువ్విన సౌందర్య శాస్త్రవేత్తలు అం టూ దాసోజ లలిత తన ‘ఉమ్మ నీటిలో చెమ్మ’ అనే కవితలో మంగలి వృత్తిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
తల మాసిన ప్రతి ఒక్కడినీ/ తలెత్తుకు తిరిగేలా చేస్తాడు/ రాజు మొదలుకొని /సామాన్యుని వరకు అతని ముందు తలదించడం /అలిఖిత రాజ్యా ంగ ఆదేశ సూత్రం అంటూ కోట్ల వెంకటేశ్వరరెడ్డి క్షురక సంహిత కవితలో అభిప్రాయపడుతాడు. సౌందర్య శాస్ర్తానికి ముందుమాట/నీతోనే మొదలవ్వాలి/సన్నాయి ఊది ఊది/సామవేదానికి సరిగమలు నేర్పిన /మంగళకరుడవు నీవు అం టూ నాయీబ్రాహ్మణుల సేవలను మంగళకరుడు కవితలో వివరిస్తారు తగుళ్ల గోపాల్.
తల కొరివి పెట్టేవాడు లేకున్నా నడుస్తుంది కాలం/ కొరిగేవాడు లేకుంటే అందవిహీనమవుతుంది లోకమంటూ వాస్తవికతను వివరిస్తారు తైద ల అంజయ్య. చిలుము పట్టిన పొదిని/చంకన పట్టుకొని/అతడు పల్లెవైపున అడుగులేస్తుంటే/కవాతు చేస్తున్న సైనికుడి లా కనిపిస్తాడంటూ బిల్లా మహేందర్ అతడొక శి ల్పి అంటూ మెచ్చుకుంటాడు. ‘వాడి కత్తెర చప్పుడికి మహిమేదో ఉంది/దేవలోక అందమంత/నేలమీదకు దిగుతుంది. కటింగ్ బేరాలు లేనప్పుడు ఆకలి సన్నాయి రాగంతో తీరు తు ంది అని మెట్టా నాగేశ్వరరావు పల్లె మంగలి కవిత ద్వారా తన అభిప్రాయా న్ని వ్యక్తపరిచారు.
ప్రముఖ కవి ఎన్. గోపి తన ‘దిశ’ (చుట్టకుదురు సంపుటి) కవితంతా మంగలిదుకాణం వా తావరణంలో నడుస్తుంది. కవి క్షవరానికి వెళ్లినపుడు కవిత్వా లోచనలు వెంటాడుతుంటాయి. గబ్బల శ్రీనివాస్ ‘క్షురకుడు’ క వితలో వృత్తి నైపుణ్యాన్ని అద్భు తంగా మెరిపించారు. వీరితో పాటు వి .రత్నాకర్ (మట్టిపలక), డా.గౌరవరాజు సతీష్ కుమార్ (క్షౌరం), రాసమొల్ల చంద్రయ్య (పల్లె సేవకులం), మధురశ్రీ మధనం (పల్లె మంగలి), సాయిప్రసాద్ (క్షురకస్వామి), దూడం నాంపల్లి (మంగళప్రదుడు), బాదెపల్లి వెంకట య్య (క్షౌరశాలలు), వెన్నెల సత్యం (క్షురకుడా), పల్లిపట్టు నాగరాజు (మంగలి ఓ న్యాయం), ఇం కా చాలామంది క్షురవృత్తిని కవితలుగా రాశారు.
‘చంద్రవంక రాయిమీద /చవురము కత్తినూరి/చముకు చముకు మెరుపు దెస్తావు ఓ మంగళన్నా/ చకిముకి పదును తెస్తావు మంగలి కత్తికి ఓ మంగళన్న’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న మంగలి వృత్తిని గురించి ‘ఓ మంగళన్న’ పాటలో గొంతెత్తి పాడుతాడు. మిత్ర (అమర్) కూడా మంగలి రామయ్య అంటూ పాటలు రాశారు.
కల్వకోల్ మద్దిలేటి ‘మా మంగళన్న’, కాకం అంజన్న ‘మంగలి’,యోచన ‘నాయీబ్రాహ్మణు లు’, కొలకలూరి ఇనాక్ ‘తలలేనోడు’, రాప్తాడు గోపాలకృష్ణ ‘పల్లె మంగలి కథలు’ తదితర కథలు, ముదిగంటి సుజాతరెడ్డి ’సంకెళ్లు తెగాయి’ నవల, నాటికలు క్షురకుల జీవితాలను, తొలివైద్య ఘనతను, వాయిద్య సొగసులను స్పృశించాయి.
ఇతర కులవృత్తుల మీద వచ్చినా సాహిత్యం తో పోలిస్తే క్షౌరవృత్తిపై వచ్చిన సాహిత్యం చాలా తక్కువ అనే చెప్పాలి. సమాజం లో విభిన్న సేవలందించిన వృ త్తి మీద నాలుగు అక్షరాలు రా యటానికి కొంతమంది కవులు ఇష్టపడటం లేదు. రాస్తే కులం గుర్తింపు అంటగడ్తరన్న భయమేమో. ఏదేమైనా మంగళ హృ దయంతోరాసిన కవులు, గాయకులు రచయితలు, కథకులకు మంగలిఅసిపె వందనాలు, కత్తి కత్తెర వందనాలు, సన్నాయి మేళాల శనార్తులు.
వనపట్ల సుబ్బయ్య
94927 65358