హైదరాబాద్లోని రవీంద్ర భారతి మినీ హాల్ (మొదటి అంతస్తు)లో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచించిన ‘కథా కచ్చీరు’ తెలంగాణ కథా సాహిత్య విమర్శ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.కాశీం సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
ముఖ్యఅతిథిగా ఆచార్య వెల్దండ నిత్యానందరావు, ఆవిష్కర్తగా డా.కె.శ్రీనివాస్, విశిష్ట అతిథిగా డా.మామిడి హరికృష్ణ, ప్రధాన వక్తగా ప్రొ.కె.లావణ్య, ఆత్మీయ అతిథులుగా డా.సంగిశెట్టి శ్రీనివాస్, వలీ హుస్సేన్ పాల్గొంటారు. తొలి ప్రతిని డా.సరోజన బండ స్వీకరిస్తారు.
-టి.వి.నారాయణ, ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్ మానేరు రచయితల సంఘం.