ప్రముఖ కవి, పాత్రికేయుడు అరుణ్సాగర్ విశిష్ట సాహిత్య పురస్కారం కోసం కవి ప్రసాదమూర్తి, విశిష్ట పాత్రికేయ పురస్కారం కోసం జర్నలిస్టు ఎం.నాగేశ్వరరావు ఎంపికయ్యారు. పురస్కార ప్రదాన సభ 2022 జనవరి 2న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. అల్లం నారాయణ అధ్యక్షతన జరుగు సభలో జూలూరు గౌరీశంకర్, కట్టా శేఖర్రెడ్డి, గోరటి వెంకన్న, సీహెచ్ క్రాంతికిరణ్, కె. శివారెడ్డి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు హాజరవుతారు. కె. శ్రీనివాస్ అరుణ్సాగర్ స్మారకోపన్యాసం చేస్తారు. అందరికి ఆహ్వానం.
-అరుణ్సాగర్ ట్రస్ట్
ఆవిష్కరణ సభ
వేణుముద్దల నరసింహారెడ్డి సిద్ధాంత వ్యాసం ‘పాలకురికి సోమనాథుని కృతులు-పరిశీలన’ పుస్తాకావిష్కరణ సభ 2021 డిసెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బుక్ఫెయిర్ (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతుంది. ముఖ్య అతిథి, ఆవిష్కర్తగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత హాజరవుతారు. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా జూలూరు గౌరిశంకర్, గిరిజా మనోహర్బాబు, అంపశయ్య నవీన్, సుధీర్రెడ్డి తదితరులు పాల్గొంటారు. అందరికి ఆహ్వానం.
-ఎర్రోజు శ్రీనివాస్ ,తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి
కథ 2020 ఆవిష్కరణ
‘కథాసాహితి’ కథా సంకలనాల పరంపరలో 31వది.. ‘కథ 2020’ ఆవిష్కరణ సభ 2021 డిసెంబర్ 26న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆవరణలో జరుగుతుంది. ఆడెపు లక్ష్మీపతి అధ్యక్షతన జరుగు సభలో కె.శివారెడ్డి, నర్సిం, గీతా రామస్వామి, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, ఎ.వి.రమణమూర్తి తదితరులు హాజరవుతారు. మధురాంతకం నరేంద్ర కథా సంపుటిని ఆవిష్కరిస్తారు. కథా రచయితలు తమ కథల నేపథ్యాన్ని వివరిస్తారు.
-వాసిరెడ్డి నవీన్, ‘కథాసాహితి’