అంబేద్కర్ హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చినప్పుడు హెచ్జె సుబ్బయ్య అనే దళిత వ్యాపారవేత్త ఇంట్లో దిగేవారు. అప్పటికే, అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కార్యకలాపాలు నిజాం పాలనలోని హైదరాబాద్ దక్కన్కూ విస్తరించాయి. హైదరాబాద్ రాష్ట్ర శాఖకు సుబ్బయ్య అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. ఆయన ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. అక్కడే అంబేద్కర్ చర్చలు, సమావేశాలు జరిపేవారు. 29 సెప్టెంబరు 1944న హైదరాబాద్లో ఓ మీటింగ్ జరిగింది. అప్పుడే రాజమణి దేవి అంబేద్కర్ను తొలి సారి చూశారు.
సుబ్బయ్య తమ్ముడు హెచ్జె కృష్ణయ్య సతీమణి ఆమె. కుటుంబ వాతావరణం, అంబేద్కర్ ప్రసంగాలు ఆమెను అమితంగా ప్రభావితం చేశాయి. దీంతో రాజమణి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్లో సభ్యురాలిగా చేరారు. వేయిమంది సభ్యులున్న మహిళా విభాగానికి అధ్యక్షురాలిగానూ పని చేశారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరేషన్ తరపున సిరిసిల్ల ద్విసభ్య నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదో సంచలనం. ఆమె మంచి వక్త. తెలుగులో, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు. హైదరాబాద్ శాసన సభలో ఆమె చేసిన ఉపన్యాసాలు, తర్వాత కాలంలో పుస్తకాలుగా వచ్చాయి.
…?సేకరణ: నాగవర్ధన్ రాయల