జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి ఫ్లైవోవర్ పైనుంచి పడిపోయింది. ఆ వెంటనే లారీ ఇంజిన్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఢిల్లీ-జైపూర్ రహదారిపై కోట్పుత్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీలో ఏం లోడు తీసుకెళ్తున్నారు..? లారీ డ్రైవర్ ఏమయ్యాడు..? ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది..? అనే విషయాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.