హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గం పరిధిలో 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు.