బూర్గంపహాడ్, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. మండలంలోని 40 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.
ఇలాంటి బృహత్తర పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఇలంటి అద్భుత పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్కు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాజారావు, వివేక్రామ్, సునీల్శర్మ, వెంకటేశ్వర్లు, శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, సిరిపురం స్వప్న, కొర్సా లక్ష్మి, భూక్యా శ్రావణి, భూక్యా భారతి, కామిరెడ్డి రామకొండారెడ్డి, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, జక్కం సుబ్రహ్మణ్యం, ఎక్కంటి శ్రీనివాసరెడ్డి, సోమయ్య, చేతుల పెద్దవీర్రాజు, గోనెల నాని, బండారు లక్ష్మీనారాయణ, కురుకుంట్ల చిన్నపరెడ్డి, ఆవుల మహేశ్రెడ్డి, ఖగేందర్రెడ్డి, కొనకంచి శ్రీను, సాదిక్పాషా, ఖాదర్, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలి
మణుగూరు టౌన్, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ విజయం కోసం సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి సోషల్మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి గడపగడపకూ తెలిసేలా సోషల్ మీడియా ప్రచారం సాగాలన్నారు. యాంపాటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.