బెల్లంపల్లి ఏరియాలో మరో ఓసీపీని ప్రారంభించేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నది. గోలేటి ప్రాంతంలో పురు డు పోసుకునే ఈ ఓసీపీలో ఈ ఏడాది నవంబర్ నుంచే ఉ త్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇ ప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించ గా, కేంద్రం నుంచి అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రక్రియ కు శ్రీకారం చుట్టను న్నది. 15 ఏండ్ల పాటు నిర్విరామంగా బొగ్గు ఉత్పత్తి చేసే ల క్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టుతో ఏరియాకు పూర్వ వైభ వం రానున్నదని ఈ ప్రాంత ఉద్యోగులు, స్థానికులు అభిప్రా యపడుతున్నారు.
– రెబ్బెన, జనవరి 29
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, ఇందులో బెల్లంపల్లి ఏరియా చాలా భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల కంటే బెల్లంపల్లి ఏరియా అడవుల మధ్యలో ఉంది. అలాంటి ఏరియాలో గోలేటి 1ఇైంక్లెన్ గని, గోలేటి 1ఏ ఇైంక్లెన్ భూగర్బ గనులు ఎన్నో ఏండ్ల పాటు నిర్విరామంగా బొగ్గును ఉత్పత్తి చేశాయి. వీటితో పాటు అబ్బాపూర్ ఓసీపీ, కైర్గూడ ఓసీపీ, డోర్లి-1, డోర్లి-2 ఓసీపీలు సంస్థ లక్ష్యాన్ని పూర్తి చేసి తలమానికంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ గనులు ఒక్కొక్కటిగా మూతపడుతూ రావడంతో బెల్లంపల్లి ఏరియా వైభవం తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం కైర్గూడ ఓసీపీ మీదనే ఏరియా ఆధారపడగా, ఇక్క డ పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి కావడం లేదు. దీంతో ఏరియాకు సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడం కష్టంగా మారింది. కొత్తగా ఓసీపీలు వస్తేనే ఏరియాకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు, కార్మిక కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇటీవల సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ జీఎంలతో జరిగిన సమావేశంలో కొత్త ఓసీపీల ప్రారంభం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో గోలేటి ఓసీపీ పనుల్లో వేగం పెరిగింది.
గోలేటి, మాదారం ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో ఓసీపీ ప్రారంభమై ఏరియాకు పూర్వవైభవం రానుందని కార్మికులు సంతోషపడుతున్నారు. గోలేటి 1, గోలేటి 1ఏలను ఓసీపీగా చేయడానికి యాజమాన్యం సర్వేలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఎంత భూ మి అవసరం ఉంటుందనే అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. గోలేటి ఓసీపీకి 1358 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, అందులో 615 హెక్టార్ల భూమి అటవీ శాఖ వారి ఆధీనంలో ఉండడంతో అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు ఆధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్ట్రీ నుంచి అనుమతులు వచ్చిన తరువాత, రాష్ట్రస్థాయి అనుమతులు పూర్తి చేసి కొత్త ఓసీపీ ప్రారంభించేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో ఓసీపీ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బెల్లంపల్లి ఏరియాలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గోలేటి భూగర్భ గనుల్లో 39 మిలియన్ టన్నుల బొగ్గు సంపద ఉండగా, ఎంవీకే-1, ఎంవీకే-2, ఎంవీకే-3 గనుల్లో 30 మిలియన్ టన్నుల బొ గ్గు సంపద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ఓసీపీల కోసం సింగరేణి కసరత్తు చేస్తున్నప్పటికీ గోలేటి ఓసీపీ ముం దుగా ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గోలేటి ఓసీపీ 15 ఏండ్ల పాటు నిర్విరామంగా నడుస్తుందని , ఏటా 3మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చునని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పూర్తి స్థాయి అనుమతులు రాగానే గోలేటి ఓసీపీలో ప నులు ప్రారంభిస్తాం. ఈ ఏడాది అక్టోబ ర్, నవంబర్ నెలల్లో ఉత్పత్తి ప్రా రంభించే అవకాశం ఉంది. గో లేటి, ఎంవీకే ఓసీపీలు ప్రారం భమైతే ఏరియాకు పూర్వవైభవం వస్తుంది. కొత్త ఓసీపీ అనుమతుల కోసం దరఖాస్తులు వెళ్లాయి. పూర్తి స్థాయిలో సర్వే చేసి నివేదికలు సిద్ధంగా ఉ న్నాయి. గోలేటి1 ఇం ైక్లెన్, గోలేటి1ఏ ఇైంక్లెన్ భూగర్భ గను లు, అబ్బాపూర్ ఓసీపీ మొత్తం కలిసి గోలేటి ఓసీపీగా ప్రా రంభిస్తారు. అనుమతుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొన సాగుతున్నాయి. గోలేటి ఓసీపీలో జీ-10 నాణ్యత కలిగిన బొగ్గు ఉంది. ఉత్పత్తి ప్రా రంభమైతే గోలేటి సీహెచ్పీ ద్వారా నిత్యం 4 నుంచి 5 రేకుల బొగ్గును రవాణా చేయవచ్చు.
-జీ దేవేందర్, బెల్లంపల్లి ఏరియా జీఎం