చండ్రుగొండ, నవంబర్ 2: అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని, కల్యాణలక్ష్మి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ములకలపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తొలుత ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ చాకచక్యంతో పరిపాలన కొనసాగిస్తూ, సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి, సర్పంచ్లు భద్రం, నాగరాజు, శ్రీను, రాజేశ్, సుధాకర్, పెంటయ్య, సుశీల, విజయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారంపూడి అప్పారావు, ప్రధాన కార్యదర్శి శనగపాటి అంజి, ములకలపల్లి పట్టణ అధ్యక్షుడు ఉమేశ్, నాయకులు మంగపతి, చందర్రావు, రాజారావు, హనుమంతరావు, సుందర్రావు, రవి తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట, డిసెంబర్ 2: సంక్షేమ పథకాల ఫలాలు గడపగడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసి మాట్లాడారు. పేద తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పింఛన్లు బ్యాంకు అకౌంట్లలో పడినప్పటికీ కొంతమంది బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడి అన్ని బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడి సకాలంలో పింఛను డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, సర్పంచ్ ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ దారా యుగంధర్, తహసీల్దార్ స్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యుడు బుడే, పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, వార్డు సభ్యులు పగడాల రాంబాబు, కొయ్యల అచ్యుతరావు, నాగేశ్వరరావు, అబ్దుల్ జిన్నా, పండూరి వీరబాబు పాల్గొన్నారు.