కామేపల్లి, డిసెంబర్ 21 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చేయూతనిస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం ముచ్చర్ల వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని మతాల ప్రధాన పండుగల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోట రవికుమార్, గుప్తా, బానోత్ సునీత, ధనియాకుల హనుమంతరావు, జాటోత్ జాయ్లూసీ, మూడ్ దుర్గాజ్యోతి, అనంతరాములు, లకావత్ సునీత, అక్బర్ అలీఖాన్, మౌనిక, అబ్రహాం, సుధాకర్, రమేశ్, జాన్ఎబినేజర్, యోహాన్, యోసోబు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, డిసెంబర్ 21 : ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యమిస్తున్నదని, క్రైస్తవులు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఎంపీపీ మాలోత్ శకుంతల అన్నారు. పేద క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కొసునూరి శ్రీను, వాంకుడోత్ జగన్, రావూరి శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, అజ్మీరా వీరన్న, ఆదెర్ల స్రవంతి, మాలోత్ కిశోర్, భూక్యా రంగారావు, కుర్సం సత్యనారాయణ, మొగిలి ఆదినారాయణ, శంకర్, అజ్మీరా అరుణ, ఇమ్మడి రమాదేవి, జడల వసంత, పాండ్యానాయక్, సోని, రమేశ్, హనీఫ్, బండారి కృష్ణ, మల్లేల నాగేశ్వరరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, గుగులోత్ శ్రీను, ముత్యాల సత్యనారాయణ, తోటకూరి పిచ్చయ్య, రాంబాబు, పప్పుల నిర్మల, పిల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, నర్సింహారావు పాల్గొన్నారు.
పెనుబల్లి, డిసెంబర్ 21 : సర్వమత సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైనదని ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు అన్నారు. పేద క్రైస్తవులకు ప్రభుత్వం అందించిన కానుకలను బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. కుటుంబసభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చెక్కిలాల లక్ష్మణ్రావు, రమాదేవి, కావూరి మహాలక్ష్మి, చింతనిప్పు సత్యనారాయణ, చీపి లక్ష్మీకాంతం, శ్రీనివాస్, తిరుమలశెట్టి నాగదాసు, బెల్లంకొండ చలపతిరావు, తడికమళ్ల శేఖర్, వెంకటేశ్వర్లు, పాస్టర్లు పాల్గొన్నారు.