ఖమ్మం సిటీ, జనవరి 6: ఖమ్మం పటేల్ స్టేడియంలో 44వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. చాంపియన్షిప్ టైటిల్ను వరంగల్ బాలికలు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ జట్టు రన్నరప్గా, ఖమ్మం మూడు, మహబూబ్నగర్ జట్టు నాలుగు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి, ఏడీసీపీ సుభాశ్ చంద్రబోస్ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అతిథులు బుడిగెం శ్రీనివాసరావు, గుడిపూడి నవీన్రావు, శ్యామల పవన్కుమార్, పోట్ల బాబూరావు, రఘునందన్, గంగా ప్రసాద్, రామారావు, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విజేతలకు ట్రోపీలు ఖమ్మం రోటరీక్లబ్ చైర్మన్ కురువెళ్ల వీరభద్రం, క్రీడాకారులకు టీ షర్ట్లను శాన్వీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్లర్ శివకృష్ణ స్పాన్సర్ చేశారు. అతిథులకు మెమెంటోలను కుడితెట్టి రామయ్య, శాలువాలు రెడ్ ఛిల్లీస్ రెస్టారెంట్ అధినేత కే.తంబి అందజేశారు.