జూలూరుపాడు, సెప్టెంబర్ 12: తెలంగాణలోనే ప్రభుత్వ వైద్యం మరింత పటిష్టంగా ఉందని, నాణ్యమైన వైద్యం అందుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధించాక ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాన్ని మంగళవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. అలాగే వారికి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలోనే ఏక్కడా లేని విధంగా ప్రభుత్వాసుపత్రులకు అధిక నిధులు కేటాయిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్ట ంచేశారు. మహిళలందరూ ఈ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుడు రాకేశ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు లావుడ్యా సోని, గాదె నిర్మల, భూక్యా కళావతి, విజయ, వేల్పుల నర్సింహారావు, పొన్నెకంటి సతీశ్కుమార్, యదళ్లపల్లి వీరభద్రం, రామిశెట్టి నాగేశ్వరరావు, మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.