కారేపల్లి, ఆగస్టు 8 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి), ఏన్కూరు, వైరా, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇళ్లలోనే లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాయినాలు సమర్పించారు. పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు. సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Karepalli : కారేపల్లిలో వరలక్ష్మి వ్రత పూజలు