ఖమ్మం: మహర్షి వాల్మీకి రచించి రామాయణ మహా కావ్యం ద్వారా సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. మహర్షివాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతంలో పద్యాలు రాసిన మొదటి కవి మహా రుషి వాల్మీకి అని అన్నారు. వేటాడే వృత్తిని కొనసాగించిన వాల్మీకి చివరికి మహా రుషిలా మరాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా బీసీ సంక్షేమాధికారి జ్యోతి, డీఎంఎహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా ఎస్సీ సంక్షేమ ఉపసంచాలకులు కె.సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన శాఖాధికారి అనసూయ, డీఈవో యాదయ్య, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, ఉపాధికల్పానాధికారి శ్రీరామ్, ఆర్టీవో కిషన్రావు, బీసీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామ్మూర్తి, ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటి కార్యదర్శి నందకిషోర్, వాల్మీకి బోయ సంఘం నగర అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు ఉపేందర్, రవి, రమేష్, సుగుణ, రమణ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.